#జైశ్రీరామ్ నామ స్మరణతో మారు మోగిన పలు ఆలయాలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాలలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ దాతలు నీల రూపకల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు కొండ కృష్ణమూర్తి కళ్యాణ మహోత్సవం జరపగా ప్రత్యేక అర్చకులు శ్రీనివాస్ శర్మ వేద మంత్రోచ్ఛారణ ల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి మండల కేంద్ర ప్రజల తో పాటు చుట్టుపక్కల గ్రామల భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆయా గ్రామాలలో ఆలయాల వద్ద ప్రజలు శ్రీరామ నామస్మరణ జపించి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం పల్నాటి జయపాల్ రెడ్డి, శానబోయిన రాజ్ కుమార్, జమాల్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నాన బోయిన రాజారం యాదవ్, పాండవుల రాంబాబు, మార్త మార్కండేయ, కొత్తపల్లి కోటిలింగాచారి, గోనెల నరహరి, బత్తిని మల్లయ్య, నాగేల్లి శ్రీనివాస్, సుధా గాని ప్రమోద్ గౌడ్, పాండవుల మనోజ్, మేడిపల్లి రాజు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కోటగిరి నారాయణ గౌడ్, గుండాల శ్రీశైలం, కొత్తపల్లి రాంనర్సయ్య, పప్పు మొగిలి, జక్కుల కుమారస్వామి, బండి కోటి, మేడిపల్లి కిరణ్, కడియాల విజయ్, వై నాల మధు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.