శ్రీ రాచణ్ణి స్వామి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానము.

Devasthanam Devasthanam

శ్రీ రాచణ్ణి స్వామి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానము

• జాతర మహోత్సవముల ఆహ్వాన

జహీరాబాద్. నేటి ధాత్రి:

స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరము పాల్గుణ శు. పంచమి తేది|| 04-03-2025, మంగళవారం నుండి ఫాల్గుణ శు. సప్తమి తేది|| 06-03-2025 గురువారం వరకు

బడంపేట నివాసాయ శ్రీ రాచరాయ చిద్విలాసయ: శ్రీ తపోజనపోష శ్రీ పార్వతీరాచరాయ నమః త్రైలోక్య సంపదలేఖ్య సమాలేఖన బిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ పరబ్రహ్మణే నమః

స్థల పురాణము

సమస్త భక్త మహాశయులందరికి మనవి చేయడము ఏమనగా శ్రీ రాచణ్ణ స్వామి దేవాలయము సంగారెడ్డి జిల్లా. గ్రా॥ బడంపేట్, తా జహీరాబాద్ నుండి 16 కిలో మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో అతి సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ రాచణ్ణ స్వామి ఆపర వీరభద్ర అవతారము భక్తులకు దర్శనమిచ్చి సంతృప్తిని శాంతిని ప్రసాదించు చున్నారు. భక్తులారా! బడంపేట పుణ్యక్షేత్రములో ఋషులు మహామును మహాతపస్సంపన్నులు తపస్సు చేసుకొనిన అతి పురాతనమైన దివ్యక్షేత్రము ఇక్కడ కోనేరు పవిత్రమైన గంగాతీర్థం. ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించి ముక్తిని సంపాదించుటకు సులువైనది. శ్రీ స్వామి వారి ఆలయం ప్రశాంత వాతావరణం కలిగి ఎత్తయిన చెట్లు, గుట్టలు, చెరువులు మరియు సశ్యశ్యామలమైన ప్రదేశంలో నెలవైయున్నది. శ్రీ రాచణ్ణ స్వామి చరిత్రను తేలియజేయుచున్నాము. అయ్యగని అను దివ్వస్థలము బడంపేట అడవిలోకలదు.ఇది దేవస్థానమునకు అర కిలోమీటరు దూరంలో వున్నది. ఇప్పటికి కూడా భక్తులు తిలకించవచ్చును. అక్కడ శ్రీ రాచట్టు స్వామి ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినో ఎప్పటికి చెలియదు. శిల్పసంపదలచే ఆకర్షింపబడుచున్నది.

శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానములో ప్రతి నిత్యమువేలాది మంది భక్తులు జనసందడితో నిత్యపూజలతో కళకళలాడు చున్నది. భక్తుల కోరికలు తీర్చుచు పూజలు అందుకొనుచు కొలువు తీరివున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగును శాలివాహన శఖం 1946 స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి మంగళవారం తేది|| 04-03-2025 నుండి 06-03-2025 ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!