
Sri Pochamma Talli
ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి కి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు చెల్లించి,యాటలతో తల్లికి హారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేసి,రంగులు వేయించి, మభక్తుల సౌకర్యార్థమై చలువ పందిళ్ళు, లైటింగ్స్, డెకరేషన్,మంచి నీటి సౌకర్యం కల్పించడం జరి గిందని ఆ సంఘం నాయకులు తెలిపారు,కోరిన కోర్కెలు తీర్చే ఆ పోచమ్మ తల్లికి ఆదివారం రోజున మొదటి మొక్కులు చెల్లించి, ఘనంగా వేడుకలు నిర్వ హిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకల్లో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి, గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి వెంకటయ్య చారి,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి,ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి, ప్రధాన కార్యదర్శి బండ్ల రాజు చారి, కోశాధికారి కడివెండి ప్రశాంత్ చారి, సహాయ కార్యదర్శి బండ్లోజు రమేష్ చారి, కార్యవర్గ సభ్యులు బెజ్జంకి మహేందర్ చారి, వినుకొండ నవీన్ కుమార్ చారి,క్రిష్ణాది సాంబయ్య చారి, కడివెండి కృష్ణ మూర్తి చారి, బిక్షపతి చారి, కడివెండి సత్యం చారి, రాజు చారి, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.