ఎమ్మెల్సీగా శ్రీ పాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం
నడికూడ,నేటిధాత్రి:
వరంగల్,ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం ఉపాధ్యాయుల విజయమని నడికూడ మండలశాఖ పి ఆర్ టి యు అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీచర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలనీ చూసిన అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారని అన్నారు.ఈ విజయం లో పాలుపంచుకున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.నడికూడ మండల కేంద్రంలో అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలలో భాగంగా ఉపాధ్యాయులకు స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖదికారి హనుమంతు రావు,నడికూడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల సతీష్,రాష్ట్ర అధ్యక్షులు గొట్టేముక్కుల శ్రీనివాస్ రెడ్డి, మోడెం రాజేందర్ బాబు, నన్నే సాబ్,బూరుగు శంకర్,ప్రేమానందం,బాలాజీ, దొంతుల శ్రీనివాస్, శివచేతన్,శ్రావణ్ కుమార్,రాజు నాయక్, కృపమ్మ, సుమలత, జయ,శివకుమార్,రవీందర్, క్రిష్ణమ్ రాజు సింగ్,రామయ్య,సదానందం, సుభాని తదితరు లు పాల్గొన్నారు.