
స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుని దివ్యచరిత్రను , శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి గోకులలో చేసిన చిలిపి చేష్టలను తో పాటు గోవర్ధన గోవర్ధనగిరి నెత్తి గోపులాని ఎలా కాపాడాడు కన్నుల కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ పూజ అనంతరం మోహన్ పంతులుగారు విద్యార్థులకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను వివరించారు.శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, మీగడ, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు.

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు గోపిక మరియు శ్రీకృష్ణ వేషాదరణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు.
అలాగే శ్రీకృష్ణ గోపికలచే ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి హెడ్మాస్టర్ సురేష్ మౌనిక మీనా సౌమ్య శ్రీనివాస్ జయప్రకాష్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు