
S. Krishna Kumari.
31జులై న ఇంటర్మిడియట్ మొదటిసంవత్సరం స్పాట్ అడ్మిషన్లు
కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణ కుమారి
పరకాల నేటిధాత్రి
2025-2026 ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు.జోన్ 4కు చెంది పదవతరగతి పాసైన విద్యార్థినులకు మండల పరిధిలోని మల్లక్కపేట (పరకాల)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో బైపిసి,ఎంపిసి గూపులలో సీట్లు కాళిగా ఉన్నాయని జులై 31 గురువారం రోజున ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్థామని,ఎంపికైన వారికి సీట్లు కేటాయిస్తామని అన్నారు.పదవ తరగతిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు ఓరిజినల్ సర్టిఫికెట్లు మూడు సెట్లు జిరాక్స్ కాపీలలు మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటాలు హజరు కావాలని కోరారు.ఎంపిక పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం 4గంటలకు ఎంపికైన విద్యార్థినుల జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు.