మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు రఘుకు ఆర్థిక సహాయం సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ పారా (దివ్యాంగుల ) స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 1న హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జాతీయస్థాయికి ఎంపికైన టేకుమట్ల మండలం అంకుశ పూర్ గ్రామానికి చెందిన సాద రఘు, పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన మట్టి సాగర్, ట్రూ బల్ క్రీడలో జాతీయస్థాయికి ఎంపికయ్యారు వారు ఈనెల 21 నుంచి 23 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కావున వారిని మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలోమాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతల శ్రీనివాస్ మాట్లాడుతూ వీరిద్దరూ జాతీయస్థాయిలో జాతీయ స్థాయి క్రీడలలో ఆడటానికి ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతూ రానున్న రోజులలో యువతకు క్రీడలలో ముందుకు సాగడానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకున్నారు భవిష్యత్తులో పేద క్రీడాకారులకు మాతృశ్రీ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడికుడ మండలం ఎక్స్ జెడ్పిటిసి కోడెపాక సుమలత కరుణాకర్ మాతృశ్రీ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు ఇనగల రవీందర్ కో ఆర్డినేటర్ దాసారపు వర్ధన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *