HPL Cricket Tournament Kicks Off in Jahirabad
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
◆:-హుగ్గేల్లీ గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ హుగ్గేల్లీ గ్రామ మైదానంలో (హెచ్ పి ఎల్) క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ.నర్సింహారెడ్డి గార్లు పాల్గొని క్రికెట్ టోర్నీని ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హుగ్గేల్లీ గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామ యువకులు ఈ (హెచ్ పి ఎల్)క్రికెట్ టోర్నీను నిర్వహించడం పట్ల హర్షవ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరి.రాజు,గ్రామ వార్డు సభ్యులు బాల్ రాజు,నిఖిల్ మరియు కాంగ్రెస్ నాయకులు నర్సింహులు,సిద్దారెడ్డి,గోపాల్,ముస్తఫా,సురేష్,పోతురాజు రాములు మరియు హెచ్ పి ఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహకులు,గ్రామ ప్రజలు,క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.
