నేటిధాత్రి మొగుళ్లపల్లి:
జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో. గ్రామ కమిటీ అధ్యక్షుడు కత్తిరాజు ఆధ్వర్యంలో. ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బలుగూరు తిరుపతిరావు పాల్గొనగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, జన్మదిన సందర్బంగా. రంగాపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కెసిఆర్ పేరున అర్చన అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి గా రావాలని ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది.వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తి రాజు మాజీ సర్పంచ్ సూరినినే రవీందర్ రావు, కత్తి రాజయ్య, నాయకులు లక్ష్మణ్ రావు, రాజేశ్వర్ రావు, సదయ్య, నరేష్, సునీల్, రమేష్, రవి, రాజు పాల్గొన్నారు.
కేసీఆర్ పుట్టినరోజున ఆలయంలో ప్రత్యేక పూజలు
