
#KondaSurekha #BirthdayPuja #Sabarimala #AyyappaSwamy #MadipelliKrishnaGoud
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
కేరళలోని అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మడిపెల్లి కృష్ణ గౌడ్
నేటిధాత్రి, వరంగల్.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన సందర్భంగా, కొండా దంపతుల ప్రియ శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మడిపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆరాధనతో అర్చన, అభిషేకాలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యం, సుసంపన్నం కోసం ప్రత్యేక హోమములు, ప్రార్థనలు నిర్వహించామని మడిపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు. మంత్రివర్యులు ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరిన్ని సేవలు అందించాలని స్వామివారి కృప లభించాలని మిత్రులతో కలిసి ప్రార్థనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు