నేత శేరీ సతీష్ రెడ్డి
కూకట్పల్లి,జూన్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడే యువతకు పార్టీ ప్రత్యేక స్థానం తగిన గుర్తింపు ఇస్తుందని కూకట్పల్లి నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షు
లు సతీష్ రెడ్డి పేర్కొన్నారు.కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో యువ తను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ నాయకు
లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి,మల్కా జిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సహకారంతో కూకట్ పల్లి నియో జకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్య క్షుడు కండి శ్రావణ్ తో చర్చించి నియోజ కవర్గం స్థాయి డివిజన్ నూతన కమిటీని వేశారు. కూకట్పల్లి నియోజకవ ర్గం యువజన ప్రధాన కార్యదర్శులుగా జేరిపటి రాజు,ఎండీ రావుఫ్,యువజన కార్య దర్శిగా వినయ్ గౌడ్,యువజన సహాయ కార్యదర్శిగా హరి, ఫతేనగర్ డివిజన్ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేశ్ లను నూతనం గా నియమించా రు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడు తూ పార్టీ కోసం కష్ట పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీలో యువతకు మంచి అవకాశాలు కల్పిస్తుం దన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువతను కాంగ్రెస్ పార్టీ ఆదరి స్తుందని అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంచింద న్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యువతకు అండగా ఉంటుదని నియోజ కవర్గంలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాబోయే రోజులో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ, మైఖేల్,ఫణీంద్ర,మహిళ నాయకురాలు రజిత,జోజమ్మ,కుమ్ము బాబు,లోగి
రాజు, బాలానగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసన,సోనూ,రాజు,స్థానిక నాయ
కులు తదితరులు పాల్గొన్నారు.