కాళేశ్వరం పుష్కరాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు
నర్సంపేట, నేటిధాత్రి:
కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నర్సంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీ తెలిపారు.బస్సులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, 7 గంటలకు నర్సంపేట నుంచి బయలుదేరుతాయి. పెద్దలకు టికెట్ ధర రూ.330, పిల్లలకు రూ.190గా నిర్ణయించారు.భక్తులు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా ప్రయాణించాలని డిపో మేనేజర్ కోరారు.
