కేతకిలో ఎస్పీ ప్రత్యేక పూజలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి బుధవారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.