జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.