వనపర్తి జిల్లాలో శుభాకార్యాలలో ఊరేగింపుల్లో.!

wanaparthi wanaparthi

వనపర్తి జిల్లాలో శుభాకార్యాలలో ఊరేగింపుల్లో,డీజే నిషేధం ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి ;

ప్రజలు డిజె సౌండ్ సిస్టమ్ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని
చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా,.శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ శబ్దాలతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామని ఎస్పీ అన్నారు వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల డీజే యజమానులు, నిర్వాహకులకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించారు
అధిక శబ్ద తీవ్రత గల డిజె సౌండ్ సిస్టమ్ ను పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ర్యాలీలో ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అందరికీ తెలుసనీ ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు ఈ డీజే సంపదాయానికి అలవాటు పడి తప్పతాగి విచ్చలవిడిగా చిందులు వేయడం ఒక ఫ్యాషన్ గా మారిందని ఆయన వివరించారు. సాంప్రదాయ బద్దంగా జరగాల్సిన పెళ్ళిళ్ళు శుభకార్యాలలో కూడా డీజే సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

 

wanaparthi
wanaparthi

అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వనపర్తి జిల్లా పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్ మరియు బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను పరిరక్షణ చట్టం సెక్షన్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు
ఈ నిషేదిత ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా ఉంటుందని ఎస్పీ తెలిపారు
ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పీ,వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ, కృష్ణ, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!