భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం.

Farmers Farmers

‘భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం’

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూభారతి అవగాహన సదస్సు ఫారంలో రైతు పేరు గ్రామం పేరు రెవెన్యూ శివారు పేరు.

సర్వేనెంబర్, భూమి విషయంలో ఎదుర్కొంటున్న సమస్య తదితర వివరాలు పొందుపరచాలన్నారు.

రెండు భూభారతి రైతుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు రెండు రెవెన్యూ గ్రామంలో భూభారతి రైతు అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

మండలంలోని ఆయా గ్రామాలలో భూముల సమస్యలు నెలకొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!