సజావుగా గ్రామసభ నిర్వహణ…..
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచర్యాగడి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. గ్రామంలో వీధిదీపాల సమస్య, మురుగు నీటి నిల్వ, త్రాగునీటి కొరత వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటి యజమాని ఇంటిపన్ను సహా ఇతర పన్నులను చెల్లించాలన్నారు.