జాతీయస్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో వెండి పతకం సాధించిన శివాత్మిక

బి యమ్ ఆర్, కరాటే డు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ఫౌండర్&డైరెక్టర్ బండారి సంతోష్

వరంగల్ ,నేటిధాత్రి:

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ గ్యాన్ విహార్ యూనివర్సిటీలలో రాజస్థా న్ స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు జాతీయ స్థాయి స్కై పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలకు గాను 20 రాష్ట్రల నుండి 17000 విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
ఇందులో తెలంగాణ హనుమకొండ నుండి సిహెచ్ శివాత్మికకు అండర్ 17 విభాగంలో వెండి పథకం సాధించడం జరిగింది.
వెండి పతకం సాధించిన సిహెచ్ శివత్మికను వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్ అభినందించారు, అదేవిధంగా తెలంగాణ స్కై మార్షల్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ ఆంజనేయులు స్కై మార్షల్ ఆర్ట్స్ కోచ్ లు రామచందర్, సాగర్, కర్ర వెంకటేష్, సిహెచ్ కర్ణాకర్, సిహెచ్ సుప్రియ, దినేష్ ,గణేష్, రణదీప్, వైష్ణవిలు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *