సిట్టింగ్ సక్సెస్..?

TGMDC

సిట్టింగ్ సక్సెస్..?

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

పలుగుల 8, 9, మరో రెండు ఇసుక రీచ్ లో పెంచిన అక్రమ వసూళ్ల రూపాలు.

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారం టి జి ఎం డి సి చీకటి ఒప్పందాలతో, అక్రమ వసూళ్లలో ఇసుక రీచులు రెట్టింపు ఉత్సాహం కనబరుస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలను టీజీఎండిసి అధికారులు, కాసులకు కక్కుర్తి పడి, సీక్రెట్ సెట్టింగ్ ల వ్యవహారాలను కొనసాగిస్తూ, అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారం, దర్జాగా కొనసాగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక ఇసుక రీచ్ లో అక్రమాల సాక్షాలు తెరపైకి వచ్చిన, చర్యలు తీసుకోవాల్సిన టిజిఎండిసి, గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్లకు మూలాఖాత్ అయి, చీకటి ఒప్పందాలతో ఇసుక రీచుల్లో ఇసుక క్వాంటిటీ పూర్తయ్యే వరకు, చూసి చూడనట్టుగా ఉండి అక్రమ వసూళ్లకు పరోక్షంగా మద్దతు తెలపడం, ఇప్పటికీ అక్రమ వ్యవహారాలు అదనపు ఇసుక రవాణా చేసిన ఉసుక్ పల్లి ఒకటి, పలుగుల పుసుపల్లి 6, పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు జరిపి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకున్నారు, కానీ టి జి ఎం డి సి మాత్రం చర్యలకు శశి మీరా అంది. ఓ అధికారి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సెట్టింగులు నిర్వహించుకొని, పక్క జిల్లా కు సంబంధించిన, రీచులు కూడా గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, హద్దులు దాటి ఇసుక రవాణా చేస్తుంటే, పీజీఎండిసి నిశ్శబ్దం, కేవలం అధికారులు సెట్టింగులు కొరకే పరిమితం కావడంతో, మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు మరింత పెరగడానికి ప్రధాన కారణం.

సిట్టింగ్ సక్సెస్..?

మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు హద్దు అదుపు లేకుండా కొనసాగుతున్న క్రమంలో, టీజీఎండిసి అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా అక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిన టీజీఎండిసి, ఇసుక కాంట్రాక్టర్ల తో సెట్టింగులు జరుపుకొని ఇసుక రీచ్ లో అక్రమాలకు పోస్ట్చాయిస్తున్నారని అధికారి వారం రోజులపాటు “గ్రీన్ ప్రాంతం” ముఖం వేసి కాంట్రాక్టర్లకు తమ వద్దకు పిలుచుకొని సెట్టింగ్ సక్సెస్ చేసుకోవడం జరిగిందని మండలంలో ప్రస్తుతం ఆ అధికారి గ్రీన్ ప్రాంతంలో వారం రోజుల మాఖామ్ చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో కొనసాగుతూ భారీ ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తున్న క్వారీల కాంట్రాక్టర్లు అధికారికి వద్దకు వెళ్లి సెట్టింగులు సక్సెస్ చేసుకున్నట్లు సమాచారం, సెట్టింగ్ సక్సెస్ కావడంతో అధికారి తిరిగి వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తుంది.

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

టీజీఎండిసి ఉన్నత అధికారి మండలంలో గ్రీన్ ప్రాంతం వద్ద, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖం వేసి పలు ఇసుక క్వారీలకు సంబంధించి కాంట్రాక్టర్లతో సెట్టింగ్ చేసుకున్నట్లు సమాచారం, ఐదు రోజుల మాఖం లో అంత సెట్టింగ్ కావడంతో ఆ అధికారి, ఇసుక క్వారీల పై చర్యలు విచారణ లాంటి ఏమీ చేయకుండా, వెళ్లిపోవడం జరిగిందని విశ్వ నీయ సమాచారం. టీజీఎండిసి అధికారి ఇసుక అక్రమాలు చేపడుతున్న ఇసుక క్వారీలను సందర్శించి, లారీల డ్రైవర్ల తో అదనపు వసూళ్లపై వివరాలు సేకరించడం, ఇసుక రీచ్ ల వద్ద కాంటాలను పరిశీలించడం, వి విల్ పై ఉన్న ఇసుక టన్నులు, లారీలకు కాంట ఇచ్చిన రసీదులు ఇలాంటివి పరిశీలించాల్సిన అవసరం బాధ్యత ఆ అధికారి చేయవలసి ఉంటుంది, కానీ నామమాత్రంగా ఒకరోజు దగ్గర్లోని రెండు ఇసుక క్వారీలకు వెళ్లి తిరిగి తమ గ్రీన్ ప్రాంతానికి వచ్చి, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖంలో అంత సెట్టింగ్ చేసుకొని వెళ్లిపోవడం జరగడంతో, టి జి ఎం డి సి అధికారుల ప్రోత్సాహంతోనే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.

 

TGMDC
TGMDC

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా లో తమ సత్తా చాటుతున్న పలువుల 8, 9, మహాదేవపూర్పుచుపల్లి 1, తోపాటు మరికొన్ని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు, ఆ అధికారి ఉన్న గ్రీన్ ప్రాంతానికి వెళ్లి, కలవడం జరిగిందని సమాచారం. ఇక టీజీఎండిసి ఉన్నత అధికారి, విధులు ఎక్కడ నిర్వహించాడు, ఆ హోటల్ విధులు నిర్వహించే కేంద్రం, ఇసుక రీచులను తనిఖీ చేయాల్సిన ఆ అధికారి, ఆ గ్రీన్ ప్రాంతంలో, ఎందుకు మఖాం వేసినట్టు, వారం రోజులపాటు అధికారి మాఖామ్, ఇసుక క్వారీల అక్రమాలకు స్థిరపడిందా, అలాంటి వ్యవహారం ఏమీ కొనసాగలేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం అందరూ ఆ హోటల్లో అధికారిని కలవడం ఎందుకు జరిగింది. ఏదైనా అధికారి వస్తే కార్యాలయంలో, విధి నిర్వహణ చేయడం జరుగుతుంది కానీ గ్రీన్ ప్రాంతంలో, కాంట్రాక్టర్లను పీల్చుకోవడం, టీజీఎండిసి గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగిస్తూ, అక్రమాలకు ప్రోత్సహిస్తూ నుండి అనడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం మరిన్ని ఉండదు.

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో ఇసుక క్వారీల అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే, దానికి మరో సాక్ష్యం ఉన్నత అధికారి కాంట్రాక్టర్లకు ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పిలుచుకొని తమ సెట్టింగులు సక్సెస్ చేసుకోవడం జరిగిందన్న సమాచారమే సాక్ష్యం. ఆ అధికారితో సెట్టింగ్ అనంతరం, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి ఇసుక క్వారీలో గతంలో 700 రూపాయలు వసూలు చేసే ఈ క్వారీ గత రెండు రోజుల నుండి వెయ్యి రూపాయలు సీరియల్ పేరుతో వసూలు చేస్తుంది. ఇక ఇదే క్రమంలో పలువుల 8 ,9, గత వారం రోజులుగా 100 నుండి 150 లారీల వరకు ఈ రెండు క్వారీలు పెద్ద మొత్తంలో లారీలు ఇసుక రవాణా చేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో 11 క్వారీలు నిర్వహణలో ఉన్నప్పటికీ వీటిలో, పలువుల 8 ,9, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు మరింత రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పరంపరను సాగిస్తున్న సాగిస్తున్నాయి.

 

TGMDC
TGMDC

 

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

టి జి ఎం డి సి ఇసుక అక్రమాల వ్యవహారం పై కనీస చర్యలు తీసుకోకపోవడం, అందిస్తాయి అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం, టీజీఎండిసి నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ వ్యవహారాలను టీజీఎండిసి అధికారులు ప్రోత్సహిస్తున్నారని సాక్షాలు తెరపైకి వచ్చిన కూడా చర్యలు తీసుకోకపోవడమే, ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో అక్రమాలు, మైనింగ్ శాఖ క్వారీలకు ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచుల నిర్వహణ కొనసాగించడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు, తాజాగా మంచిర్యాల జిల్లా ఎర్రయిపేట పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక కాంట్రాక్టర్, టీజీఎండిసి నిబంధనలను తుంగలో తొక్కి, నడి గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కుంట్లం గ్రామ శివారు వద్ద ఉన్న గోదావరి నుండి ఇసుకను రవాణా, చేయడం జరుగుతుంటే టీజీఎండిసి అధికార యంత్రాంగం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మిస్తే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఏలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వివరించడం, ఇసుక క్వారీ అంటేనే అధికారులకు ,”కన్ఫామ్ కమిట్మెంట్” అనే విధంగా మారింది. అందుకే ఏమో ఇసుక క్వారీల్లో అక్రమాలు, సరిహద్దులు దాటి ఇసుక తోడుతున్న ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

గత నెల ఏప్రిల్ 4వ తేదీ నుండి నేటి ధాత్రి వరుస కథనాలతో పి జి ఎం డి సి కింది స్థాయి అధికారి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు, ఇసుక వారిల్లో జరుగుతున్న అక్రమాలకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సూత్రధారి టీజీఎండిసి శాఖ అని సాక్షాలతో పైకి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఉన్నత అధికారులు టి జి ఎం డి సి మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్, దృష్టి సాధించకపోవడం కిందిస్థాయి అధికారులకు మరింత బలాన్ని చేకూర్చి, టి జి ఎం డి సి ఇసుక రీచ్ ల వద్ద ఉన్న సిబ్బంది నుండి మొదలుకొని ఉన్నత అధికారుల వరకు, చీకటి ఒప్పందాలు విచారణ పేరుతో హోటల్లో ముఖం వేసి కాంట్రాక్టర్లను పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది అన్నా తాజా సమాచారం, వీటిని పరిగణంలోకి తీసుకుంటే టీజీఎండిసి ఇసుక రీచుల అక్రమాలకు సూత్రధారి అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

TGMDC
TGMDC

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.మండల ప్రజలు.

ఇసుక అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవడంలో టి జి ఎం డి సి విఫలం కావడం జరిగింది. అక్రమ వ్యవహారాలపై అనేక సాక్షాలతో, తేరపై కి తీసుకువచ్చిన అధికార యంత్రాంగం, టీజీఎండిసి ఉన్నత అధికారులు స్పందించకపోవడం, ఇసుక కాంట్రాక్టర్లు అక్రమాల్లో మరింత రెట్టింపు ఉత్సాహం కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు ఇసుక రీచుల్లో నేటికీ అమలు కాకుండా, ఇసుక రీచుల్ల క్వాంటిటీ అయ్యేవరకు టీజీఎండిసి చీకటి ఒప్పందంతో, కాంట్రాక్టర్లకు శాఖ సిబ్బంది ద్వారా వసూలు చేయించి ఇవ్వడం లాంటి కొనసాగించడం తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక వ్యవహారంపై ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేలా ఇప్పటికే టీజీఎండిసి వివరించడం జరిగింది. టి జి ఎం డి సి ఇసుక అక్రమాలపై ఇక చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ప్రజలకు కూడా స్పష్టం కావడం జరిగింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల వ్యవహారంపై దృష్టి సాధించి, రెవెన్యూ విజిలెన్స్ శాఖలను ఆదేశించి విచారణ చేపట్టి, ఇప్పటికీ పెద్ద మొత్తంలో అక్రమాలు చేపట్టిన క్వారీలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!