గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర త్రికూట లయం లో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగ రంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి గ్రామంలోని ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కొమురయ్య, అర్చకులు నవీన్ శర్మ, భాస్కర్ శర్మ, శివకుమార్ శర్మ, గణేష్, శేఖర్, సత్యనారాయణ, గొట్కూరి చందు, దాసరి మధుసూదన్, నక్క కొమురయ్య హనుమాన్ దీక్షపరులు మహిళలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
శ్రీ రామలింగేశ్వర ఆలయంలో సీతారాములు కళ్యాణ వేడుకలు
