రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
సీతారాముల తలంబ్రాల కోసం రూ.151 తో బుక్ చేసుకుంటే, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చుతామని, జహీరాబాద్ ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు కోహీర్, సహా వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఆసక్తి కలిగిన వారికి బుక్ చేశారు. భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న వారికి రశీదు అందజేస్తున్న కండక్టర్ బి. నరేష్. సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ కోరారు.