
Ramprasad Kesi Raju.
జాతీయ కవి సమ్మేళనంలో సిరిసిల్ల కవులకు సత్కారం
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ,తెలంగాణ పోలీస్ శాఖ, మరియు జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీసులు_ సామాజిక బాధ్యత అనే అంశం పై కవి సమ్మేళనం హైదరాబాద్ లో జరిగినందున ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు రాంప్రసాద్ కేశి రాజు, ముఖ్య అతిథి ఐపీఎస్ ,ఎం రమేష్ డి.ఐ.జి ,వెంకట సాయి నాంపల్లి సీ.ఈ.ఓ జ్యోతి, విశ్వనాథ రాజు అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్ తెలంగాణ శాఖ. తెలంగాణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు, రచయితలు డాక్టర్ జనపాల శంకరయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు,సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలాపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ .వాసర వేణి పరుశురాం రక్షకభటులు కవిత చదివారు. సిరిసిల్ల సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయి మహేశ్ ,రక్షణ విలువ అనే అంశంపై తన కవితను విన్నవించారు. తర్వాత ముఖ్య అతిథులు ఘనంగా కవులను సత్కరించారు.