యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

war footing war footing

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!