కోల్ ఇండియా స్థాయి పోటీల్లో విజయం సాధించి సింగరేణికి ఖ్యాతిని పెంచాలి

మందమర్రి, నేటిధాత్రి:-

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో విజయం సాధించి సింగరేణికి ఖ్యాతిని పెంచాలని ఎంవిటీసీ మేనేజర్ శంకర్ తెలిపారు. మందమర్రి ఏరియా సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ వారి ఆధ్వర్యంలో 59వ వార్షిక క్రీడలను మేనేజర్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని, కంపెనీ లెవెల్, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని మందమర్రి ఏరియాకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం మొదటి బహుమతి దక్కించుకున్న కేకే అండ్ ఎస్ కె గ్రూప్, ద్వితీయ బహుమతి గెలుపొందిన కాసిపేట1, కాజీపేట2 జట్టు సభ్యులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త ఏ రవి కుమార్, క్రీడల జనరల్ కెప్టెన్ టీ చిన్నయ్య, గ్రౌండ్ ఇంచార్జ్ నస్పూర్ తిరుపతి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!