మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థ క్రీడాకారులు ఏరియా, కంపెనీ, కోలిండియా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా సర్వే అధికారి ఉజ్వల్ బందోపాధ్యాయ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని, ఏరియాకు, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, సమన్వయకర్త ఏ రవికుమార్, జనరల్ కెప్టెన్ టి చిన్నయ్య, బాస్కెట్ బాల్ డి నాగరాజు, గ్రౌండ్ ఇంచార్జ్ నస్పూర్ తిరుపతి, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.