"Singareni Funds Misuse Alleged by Former MLA"
సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు ఉండే సంస్థ సింగరేణి సంస్థ దానిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో ఉన్న నిధులు అన్నిటిని వాడుకొని సంస్థను నిర్వీర్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఫుట్ బాల్ గేమ్ ఆడటానికి సింగరేణి సంస్థ నుండి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొని ఆటలు ఆడాడు కానీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరపడానికి నిధులు లేవు అంటున్నారు సింగరేణి ఉద్యోగులు కార్మికులు కార్మికుల కుటుంబాలు ప్రతి సంవత్సరం ఘనంగా సింగరేణి ఆవిర్భావ నిర్వహించుకునేటివి కానీ నేడు వాటికి నిధులు కేటాయించకుండా తూతూ మంత్రంగా ఆవిర్భావ దినోత్సవాలను జరపడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ సిద్దు పట్టణ అధ్యక్షుడు జనార్దన్ బీబీచారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు
