రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.!

BRS

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పట్టణ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డ ఆదేశాల మేరకు పార్టీ 2 వ వార్డు అద్యక్షులు పోతరాజు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదన్నపేట చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చి నర్సంపేటను సస్యశ్యామలం చేసిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డిది అని పేర్కొన్నారు.మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ కు నిధులు తీసుకువచ్చి చెరువు అభివృద్ధికి కృషిచేశారని,పట్టణ ప్రజల తాగునీటి కోసం అర్బన్ మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు సౌకర్యం కల్పించారని వివరించారు.వైద్య రంగంలో డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, మెడికల్ కళాశాల, టీ డయాగ్నొస్టిక్ సెంటర్ , నర్సంపేట కి తీసుకు వచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని,ఈనెల 27 న జరిగే బిఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,మాజి కౌన్సిలర్లు బండి ప్రవీణ్, శివరాత్రి స్వామీ, బండి రమేష్, వాసం సాంబయ్య,పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్, 2 వ వార్డు పార్టీ ముఖ్యనాయకులు ముత్తినేని వీరస్వామి, ముత్తినేని వీరన్న, ముత్తినేని శ్రీను, ముత్తినేని సోమేశ్, పోతురాజు అచ్చయ్య, పోతరాజు రాజు, వడిజర్ల శీను, పొన్నల ప్రభాకర్, ముస్కు శీను, జడల శీను, మల్లేష్ గూడెపు, యాకు భాష, గూడెప్ రాకేష్, ఆకుల చందు, ఆకుల వీరన్న, మిటబెల్లి శీను, చందు రాజు, మల్లూరు దేవన్న, హంస రవి, వంశీ, ఆకుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!