శ్రీపాదరావు సేవలు మరవలేనివి

మందమర్రి, నేటిధాత్రి:-

మంథని శాసనసభ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ప్రజలకు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుండి వచ్చిన శ్రీపాదరావు శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగి పేద ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. 1984 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంథని నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన ఆయన అనంతరం జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించి, శాసనసభ స్పీకర్ గా సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సునీత, అసిస్టెంట్ ఇంజనీర్ ఏ అచ్యుత్, సానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, సీనియర్ అసిస్టెంట్ ఏ రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎండి సోయలుద్దీన్, బి ప్రదీప్ కుమార్, ఇంచార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏనుగు రఘురాం, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, ఈ రవీందర్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయంలో…

మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుర్రం మంగా శ్రీనివాస్ గౌడ్, ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, ఎంపిఓ బి బీరయ్య, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *