డిసెంబర్ 6 నుండి 10వరకు గోశాల ప్రారంభోత్సవ వేడుకలు…
భద్రాచలం నేటి ధాత్రి
గోమాతల సన్నిధి లో గోవిందుడు …..
భద్రాచలం :శ్రీనృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో అద్భుతమైన గోశాల ను నిర్మించడం జరిగినది. గోవుని గోవిందున్ని ఓకే దగ్గర దర్శించి తరించే భాగ్యాన్ని భక్తులకు కలగాలనే ఉద్దేశ్యంతో సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీనృసింహ భక్త కుటుంబం ఆధ్వర్యంలో
*గో- గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని*ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ రోజురోజుకి గోవుకు ఆదరణ తగ్గుతున్నదని గోమాత ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పడానికే ఈ సుందరమైన గోశాల నిర్మాణం చేయడానికి పూనుకున్నామని, సకల దేవతా రూపమైన గోమాతను గోవిందున్ని ఏక కాలంలో దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నారు, అంతేకాకుండా తమ పూర్వీకుల నుండి వారసత్వంగా పూజలు అందుకుంటూ వస్తున్న 750 సంవత్సరాల క్రితం నాటి కల్ప వృక్ష నరసింహ సాల గ్రామ మూర్తిని కూడా భక్తులు దర్శించి తరించే భాగ్యాన్ని అందరికీ కల్పించనున్నామని అన్నారు.ఇక్కడ నారసింహుని రక్ష కట్టుకొని ముడుపులు కడితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే సుదూర ప్రాంతాలనుండి ప్రతి నిత్యం కొన్ని వందల మంది దర్శనం కొరకు వస్తుంటారని ఎంతో మంది కోర్కెలు నెరవేరి మళ్ళీ మళ్ళీ రావడం సకాలంలో కొన్ని కొన్ని సార్లు వారికి దర్శనభాగ్యం కలగక పోవడం తో భక్తుల సౌకర్యం కొరకు గోవుని గోవిందున్ని ఒక దగ్గర చేర్చి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించాలని ఈ మన్యంలో గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని నిర్మించడo జరిగినదని అన్నారు డిసెంబర్ 6వ తారీకు బుధవారం నుండి డిసెంబర్ 10వ తారీకు ఆదివారం వరకు ప్రతిరోజు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నామనిఅన్నారు ప్రతి రోజు శ్రీ లక్ష్మీనారసింహ హోమం, సుదర్శన హోమంతో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ కరగాలని మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నామని అన్నారు అంతే కాకుండా ప్రతిరోజు దర్శనం కొరకు వచ్చే యాత్రికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నదని కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించాలని కోరారు.