వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభం అయ్యాయని గురువారం నాడు ఉదయం 10.50 కి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వహి నిర్వాహకులు న్యాయవాది ధార వెంకటేష్ దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్. క్రాంతి ట్రాన్స్ పోర్టు ఈపూరి వెంకటేష్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ ఆలయ పురోహితులు వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే స్వామి వారి పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించాలని వారు కోరారు
వనపర్తి లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం
