ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్
నర్సంపేట నేటిధాత్రి:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.
జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్ ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతినిత్యం విద్యార్థులకు సేవలు అందిస్తూ అవినీతిని అంతం చేస్తానని తెలియజేశారు.