మున్సిపల్ చైర్మన్ ,కౌన్సిలర్లకు షోకజ్ నోటీసు

# నర్సంపేట పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్.

నర్సంపేట , నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మాన విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నియమాలికి కట్టుబడి ఉండని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్, 12వ వార్డు కౌన్సిలర్ ఎండి పాషా, 24 వ వార్డు కౌన్సిలర్ దార్ల రమాదేవిలకు షోకజ్ నోటీసులు జారీ చేసినట్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్ విశ్వాసం కోల్పోవడంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా గమనించిన పార్టీ మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లలకు అందుకు సహకరించాలని సూచనలు తెలిపినప్పటికీ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ సమన్వయానికి సహకరించకుండా స్థానిక పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా క్యాంపు నిర్వహించినందుకు గాను పట్టణ కమిటీ ఆధ్వర్యంలో షోకజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. వారం రోజులలో సంతృప్తికి కారమైన సమాధానం ఇవ్వని యేడల వారిపైన పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *