దశాబ్ది బీఆర్ఎస్ పాలనలో..తెలంగాణ రాష్ట్రాన్ని శతాబ్ది వెనక్కి నెట్టింది

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్..జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
దశాబ్ది బీఆర్ఎస్ పాలనలో..తెలంగాణ రాష్ట్రాన్ని శతాబ్ది వెనక్కి నెట్టిందని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజులు అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మి పథకం క్రింద సబ్సిడీతో రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా..శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బండి సుదర్శన్ గౌడ్, తక్కల్లపల్లి రాజులు మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటూ..ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ పాలనలో అరిగోసను అనుభవించిన తెలంగాణ ప్రజలు..తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే..తమ బతుకులు బాగుపడతాయని..ఇందిరమ్మ రాజ్యం వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సాధించలేనిది..కేవలం రెండు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ సాధించి చూపించడంతో..బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక..ప్రజలను తప్పుదోవ పట్టించి..పబ్బం కడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ రఫీ, రక్తాని గోపాల్ రావు, బండారి కొమురయ్య, మాజీ సర్పంచులు ఏకాంబ సుగుణ-రామారావు, యుగంధర్, మండల నాయకులు చంద్రారెడ్డి, పెంతల మధుకర్, గాజుల పరుశురాములు, దొమ్మాటి ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!