రేపు శని అమావాస్య వేడుకలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి సప్తపురి శనిఘాట్ దేవాలయంలో శని అమావాస్య వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఉదయం 5గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం, శని మహాయజ్ఞం, మహా మంగళహారతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.