Shabarimala Yatra Completed by Ramesh Kanna Swami
శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి ఘన సన్మానం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ విజయగణపతి ఆలయంలో అయ్యప్ప దీక్షలో భాగంగా మాల ధరించి పాదయాత్ర ద్వారా యాత్రను పూర్తి చేసుకున్న రమేష్ కన్నా స్వామిని ఆలయ అయ్యప్ప బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో మాల ధరించి పాద యాత్రతో అయ్యప్ప స్వామిని దర్శించుకొని పట్టణానికి రావడం శుభకరమన్నారు. ఇప్పటికి ఆరుసార్లు పాదయాత్ర చేసిన రమేష్ కన్నా మరో 14 సార్లు యాత్రను దిగ్విజయం చేయాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాములు కుమార్ స్వామి, రమేష్ సదానందం, దేవేందర్ చారి, శ్రీధర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
