
ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 8,158 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్స్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల దగ్గర నుండి కాలేజ్ యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తూ పెండింగ్ ఫీజులను బలవంతపు వసూలు చేస్తున్నారని అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద ఏమాత్రం ప్రేమ లేదని వారు అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పై చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్ల కోసం కాలేజ్ చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కొన్ని కళాశాలలో ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రినీ నియమించటకపోవడం సిగ్గుచేటని అలాగే విద్యారంగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాల పెళ్లి మనోజ్ కుమార్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన,జిల్లా కమిటీ సభ్యులు శివ, రాకేష్ నాయకులు దినేష్, జశ్వంత్, వినయ్,అరుణ్, శివ సాయి, మధు, అక్షయ, మనీషా, రుచిత ,స్వప్న, తదితరులు పాల్గొన్నారు.