Sewage Water Floods NH44 in Balanagar
మురుగు వాసనతో.. భరించలేకపోతున్నాము సారు.!
బాలానగర్ / నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని పాత గెస్ట్ హౌస్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మలవిసర్జన చేసిన నీరు రోడ్డుపై ప్రవహిస్తునడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతలుగా మారి ఇబ్బందులు పడుతుంటే.. కంపు వాసనతో భరించలేకపోతున్నామన్నారు. గత 6 నెలలుగా మురికి నీరు ప్రవహిస్తున్న ఎవరు మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై మలవిసర్జన నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, బాటసారులు మండల కేంద్ర ప్రజలు కోరారు.
