భాగ్యనగర్ తాండా 4వ వార్డు లో వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు.
పట్టించుకోని నాయకులు ప్రభుత్వం అధికారులు.
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ గ్రామపంచాయతీ పరిదిలో గల నాలుగోవ వార్డులో సందు రోడ్డులో గూగులోత్ సామిని బొజ్యా వ్రృద్దుల ఇంటి దగ్గర వర్షం నీరుతో వాగును తలపిస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటిదగ్గర వర్షపు నీరు నిలువ ఉండిపోయి మోకాళ్ళ లోతు వ్యర్దపు నీరు వచ్చి చెరడంవలన వారు బైటకు వెళ్ళలేని దుస్థితి లో బిక్కు బిక్కు మంటూ ఇంటిలో నె ఉండవలసి పరిస్థితి ఉందని వెనకాల ఉన్న సిమెంట్ రోడ్డుకు సైడ్ కాలువ లేక పోవడం కారణంగా నిలువ ఉన్న వర్షం నీరుతో పాటు మురుగు నీరు చేరుట వలన విషజ్వరాలు మలెరియ డెంగ్యూ బారిన పడె ప్రమాదం ఉన్నదని. కోంత మంది వర్షం నీళ్ళు వేళ్ళ కుండా అడ్డుగా మట్టిని పోయించినారని వారినిఅడ్డుగ ఉన్న మట్టిని తోలగించమని వెడుకున్న కానీ తోలగించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ పక్కన ఉన్న వారిని అడిగితే గొడవలకు దిగుతున్నారని ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపాలని తెలిపారు.

ఆ వ్రృద్ద దంపతులైన గుగులోత్ సామిని బొజ్యా మొకాళ్ళ లోతు వ్యర్దపు దుర్గందపు నీళ్ళ లో నుండె నడిచివేళ్ళె దుస్థితి లో ఉన్నారు వారి దినస్తితిని చూసిన స్థానిక నాయకులు పట్టించుకున్న నాథుడే లేడని సింగరేణి మండల ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేంబడి ఉన్న మట్టిని తోలగించి సైడు కాలువలు తిపించి ఆ వ్రృద్దుల ఇంటిలోనికి వ్యర్థ పునీరు చేరకుండ చూడండి అంటూ వారు తమ ఆవెదన వ్యక్త పర్చారు.