PIDS Conducts Tribal Welfare Service Programs
పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.
మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…
బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…
కేసముద్రం/ నేటి ధాత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,
