బిఆర్ఎస్ గూటికి చేరిన సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్,మధు యాదవ్

మల్కాజ్గిరి,
అక్టోబర్ 10 (నేటి ధాత్రి) :
సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, మధుయాదవ్ వారి అనుచరులు మంగళవారం ప్రగతి భవనంలో మర్రి రాజశేకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజ్గిరిలో వివిధ పార్టీల నుంచి డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారన్నారు.మరింత ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు పనిచేసి అత్యధిక మెజారిటీతో రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని సూచించారు.గతంలో కన్నా బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరిలో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పెనల దూసుకుపోతుందని అన్నారు.ఇదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త పనిచేస్తే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని,ఈ విజయం తెలంగాణ ప్రజలకే దక్కుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్లు సునీతరాము యాదవ్, సబిత అనిల్ కిషోర్,మీనా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,అమీన్ ఉద్దీన్, జగదీష్ గౌడ్,బద్దం పరుశురాం, ముర్గేష్, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!