దీపా దాస్ మున్షీని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత డాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం పీగా పోటీ చేసేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్ప డిన తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతు న్నారు.40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో ఎన్.ఎస్.యు.ఐ, యువజ న కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని దీపా దాస్ మున్షీకి వివరించారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజ కవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో దీపా దాస్ మున్షీ సాను కూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పనిస రిగా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనూ హ్య స్పందన లభిస్తోందని ఇందు
లో భాగంగానే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఆరు హామీలను హామీ ఇచ్చిన నేపథ్యం లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వ దించాలని తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 17
సీట్లలో 16 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుం దని దేశంలో సైతం అత్యధిక పార్ల మెంట్ స్థానాలు గెలుపొంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *