నవాబుపేట మండలంలో సీనియర్ సిటిజన్ సమావేశం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో మంగళ వారం రాజు సీనియర్ సిటిజన్ ఫోరం సమావేశం నిర్వహించారు. అబ్దుల్ లతీఫ్ అధ్యక్షతన వహించి వయవృద్ధుల సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం కొండాపురం హనుమయ్య భగవద్గీత ఆధ్యాత్మిక చింతన క్లుప్తంగా వివరించారు.ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర అప్ప మాట్లాడుతూ వయవృద్ధుల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారాల అలవాట్లను తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరమ్ అధ్యక్షుడు చిగుళ్లపల్లి నర్సింలు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్,వివో ఆనందం, పండరీనాథ్,సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *