ఏడుగురుపై కేసు నమోదు.
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో దసరా పండగ సందర్భంగా తలెత్తిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే అప్పల్ రావు పేట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా మచ్చ పృద్వి, తాళ్ల సతీష్, ఇసంపల్లి ప్రవీణ్, కొయ్యల సతీష్, కొయ్యల సుమన్, లు దసరా జరుగుతున్న సమయంలో బరపాటి గణేష్ తో గొడవకు దిగి గణేష్ ను ఏడుగురు కలిసి తీవ్రస్థాయిలో కొట్టగా, వారు కొట్టిన దెబ్బలకు అవమానం భరించలేక గణేష్ తన ఇంటి స్లాపు ఎక్కి గడ్డి మందు తాగి అట్టి విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపగా వెంటనే హనుమకొండలోని చక్రవర్తి ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ గణేష్ మరణించాడని ఎస్సై మహేందర్ తెలిపారు. అనంతరం ఎస్సై మహేందర్ మాట్లాడుతూ మృతుడి తల్లి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.