స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు.

self-government-day self-government-day

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు

జహీరాబాద్:నేటి ధాత్రి

ఝరాసంగం మండలం లోని క్రిష్ణాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ శ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా, ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు కనబర్చిన ప్రతభను కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు ధర్ము రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎచ్.యం. గా శాంసన్, ఎంఈఓ గా జెస్సిక, ఉపాధ్యాయులుగా దీపిక, అర్చన, ఎస్తర్ రాణి, వెన్నెల, సంధ్య, అరవింద్, సూరజ్ మంచి ప్రతిభ కనబర్చినారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్టార్ లిన్, సురేష్, నాగమణి గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, అంబమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!