
B. Naresh
ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక,
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కమాల్పల్లికి చెందిన బి.నరేశ్ సీయూసెట్-2025లో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ప్రత్యేక కోచింగ్ లేకుండా కేవలం ఇంటి వద్దనే చదువుకొని ఈ విజయాన్ని సాధించాడు. ప్రాథమిక విద్యను ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ను కొండాపూర్ గురుకులంలో పూర్తి చేశాడు. నరేశ్ను గ్రామస్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.