బియ్యం స్వాధీనం ఇద్దరు అరెస్ట్..
నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని గూనిపర్తి గ్రామ సమీపంలో TS 02UD1582 గల వ్యానులో అక్రమంగా పిడిఎస్ బియ్యమును తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కమలాపూర్ పోలీసులు అట్టి వాహనమును తనిఖీ చేయగా దానిలో 140 క్వింటాల పిడిఎస్ బియ్యం లభించినట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. సుమారు ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయల విలువగల పీడీఎస్ బియ్యం అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ ను స్వాధీనపరుచుకునీ కేస్ నమోదు చేసినట్లు తెలిపారు.నడికుడ మండలము చర్లపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి ఐలయ్య తో పాటు హుజరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన నగునూరి రాకేష్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ లవకుశ రెడ్డి, పోలీస్ సిబ్బంది సర్వర్ పాషా, కృష్ణమోహన్ పాల్గొనట్లు సిఐ తెలిపారు.