చిన్న పిల్లల్లోనే దేవుణ్ని చూస్తా

వారి సేవ కోసం ఏదైనా చేస్తా

వచ్చే ఏడాది షూలతో పాటు స్కూల్ బ్యాగులు ఇస్తా

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

తాను చిన్న పిల్లల్లోనే దేవుడ్ని చూస్తానని, వారి కోసం ఏదైనా చేస్తానని ఎంత సమయమైనా కేటాయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు బూట్లను ఇస్తున్నామని, వచ్చే ఏడాది బూట్లతో పాటుగా స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కూడా ఇస్తామని ప్రకటించారు.
మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శనివారం బూట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, దిగువ మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి, తమ ఆస్తులను అమ్ముకొని తమ పిల్లలను ప్రైవేటు స్కళ్లలో చదివిస్తున్నారని చెప్పారు. అయితే ఆర్థిక స్థోమత లేని నిరుపేద తల్లిదండ్రులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థుల కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండు టెండలో నడవడం చూసానని, ఆ సమయంలోనే వారందరికీ షూ లను ఇస్తానని హామీ ఇచ్చానన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సుమారు 27 వేల మంది విద్యార్థులకు బ్రాండెడ్ షూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులతోనే విద్యార్థులకు షూలను అందిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి గుర్తు చేసారు. వచ్చే ఏడాది నుంచి షూలతో పాటుగా స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కూడా ప్రతి విద్యార్థికీ అందజేస్తామని ప్రకటించారు. ఇటీవల జరిగిన హిందూ, ముస్లిం పండులకు తాను హాజరు కాలేకపోయిన విషయాన్ని తమ పార్టీ నాయకుడు ఒకరు అడిగారని తెలిపారు. వ్యక్తిగతమైన సమస్యల కారణంగా తాను దేవుడి ప్రదర్శనల్లో పాల్గొనలేకపోయానని వివరించారు. అయితే చిన్న పిల్లల్లో దేవుడు ఉంటాడని తాను నమ్ముతానని, చిన్న పిల్లల్లో తాను దేవుడ్ని చూస్తానని వివరించారు. చిన్న పిల్లల సేవ కోసం తాను ఏదైనా చేస్తానని, ఎంత సమయమైనా కేటాయిస్తానని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని పిల్లలకు మంచి చదువులు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియో.కవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన భవనాలు, తాగు నీరు, తరగతి గదులు, ప్రహారీ గోడలు వంటి అన్ని మౌలిక వసతుల కల్పనల కోసం ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరానని, దీని కోసం ఎన్ని కోట్ల రుపాయలు అవసరమైనా తాను మంజూరు చేయించుకువస్తానని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. కాగా శనివారం నాడు మిడ్జిల్ మండలంలోని దోనూర్, వల్లభరావు పల్లి, అయ్యవారిపల్లి, వాడ్యాల, వేముల, మిడ్జిల్, బోయిన్ పల్లి కి చెందిన విద్యార్థులకు షూలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజు నాయక్, ఎంఇఓ ఎంఇఓ మంజులాదేవి, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శివకుమార్, మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు అల్వాల్ రెడ్డి, రాజారెడ్డి తదితరనాయకులు పాల్గొన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు దుష్వంత్ రెడ్డి షూ పంపిణీ కార్యక్రమం..

నవాబుపేట మండలం కొల్లూరు జెడ్ పీ ఎచ్ ఎస్,హై స్కూల్ ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థులకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయితీ లో పరిధిలోని అన్ని ప్రాథమిక స్కూల విద్యార్థులకు తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే సోదరుడు దుశ్శాంత్ రెడ్డి, షూ పంపిణీ చేయడం జరిగింది. వారికి విద్యార్థుల తరఫున తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!