రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మే 24న సిరిసిల్ల మండలం, బోనాల గ్రామం, రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ” కార్యక్రమంను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతులు పంటలకు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని , అధిక మోతాదులో యూరియా వాడకం వలన కలిగే నష్టాలను వివరిస్తూ, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్, పేడ ఎరువులను వినియోగించాలని సూచించారు.
భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను వాడడం వలన సాగు ఖర్చు తగ్గిoచవచ్చు అని సూచించారు.
అoతేకాకుండా, చీడ పీడల ఉధృతిని బట్టి సరియైన మోతాదులో రసాయనిక మందులను వాడడం మరియు జీవ ఎరవుల పై అవగాహన కల్పించారు.
అలాగే పంట మార్పిడి అవశ్యకత మరియు పచ్చిరొట్టెల ఎరవు లాభాల గురించి తెలపడం జరిగింది.
వాటితో పాటు పామాయిల్ సాగు వలన కలిగే లాభాలను గురించి తెలపడం జరిగింది.
పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం, పంట వైఫల్యాల సమయంలో పంట భీమా పొందే విధీ విధానాలను మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం యొక్క ఆవశ్యకతను విపులంగా వివరించారు.
సుస్థిరమైన వ్యవసాయంలో పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను, సాగునీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం మరియు కశేరుక కీటకాల, నిర్వహణపై సమాచారాన్ని వివరించారు.
రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అనంతరం శాస్త్రవేత్తలు, రైతులు, అధికారులు, ఈ కార్యక్రమంలో తెలుసుకున్న అంశాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల, వ్యవసాయ శాస్త్రవేత్తలు, డా. కె. కనక దుర్గ మరియు కె. భవ్యశ్రీ., యo.ఏ.ఓ., సిరిసిల్ల కె . సందీప్ , హార్టికల్చర్ ఆఫీసర్ వి.గోవర్ధన్, విద్యార్థులు, ఆర్. ఆశిష్ మరియు జె. శిరీష , రైతులు, మరియు మహిళా రైతులు పాల్గొన్నారు.