మహబూబ్ నగర్/నేటి ధాత్రి.
న్యూయర్ వేడుకలు వద్దు రక్తదానం ముద్దని శ్రీ సంరక్షణ ఫౌండేషన్ మంగళవారం మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు చేతులమీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిఎస్పి మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్చదంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ముఖ్యంగా యువత న్యూయర్ వేడుకల పేరుతో మద్యపానానికి దూరంగా ఉండి.. రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యవసర సమయాలలో బాధితులకు రక్తదానం చేసి సహాయపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పటేల్ సుమన్, ప్రశాంత్, నవీన్ కుమార్, పవన్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.