Savitribai Phule Jayanti Celebrated Grandly in Narsampet
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
నర్సంపేట,నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షర ద స్కూల్ ,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల విద్యకోసం ఎనలేని కృషి చేసారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జయంతిని మహిళా టీచర్స్ డే గా నిర్వహించడం చాలా గొప్పన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ,సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆర్.జ్యోతి గౌడ్,జి. భవాని,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
